ఏపీ నూతన గవర్నర్​గా నేడు జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం

-

ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్​గా ఇవాళ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజ్​భవన్​లో నూతన గవర్నర్ జస్టిస్ నజీర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ప్రమాణ స్వీకారానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను ఏపీ మూడవ గవర్నర్‌గా ఈనెల 12వ తేదీన నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news