రీ ఎంట్రీ లో కూడా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న కాజల్ అగర్వాల్..!

-

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి.. ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె స్టార్ హీరోల సరసన వరుస పెట్టి సినిమాలు చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపద్యంలోనే బృందావనం, బిజినెస్ మాన్, డార్లింగ్ , టెంపర్ , మిస్టర్ పర్ఫెక్ట్, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇకపోతే హీరోయిన్ గా బిజీ కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు తో కలిసి ఏడు అడుగులు వేసింది.

అంతేకాదు తమ దాంపత్య బంధానికి గుర్తుగా గత ఏడాది ఏప్రిల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యంలో తేలి ఆడుతున్న ఈ ముద్దుగుమ్మ తన కుమారుడికి సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంది. ఇకపోతే పెళ్లి తర్వాత దాదాపు రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలోని జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ తన బాడీని మునుపటిలాగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు రీఎంట్రీలో కూడా రెమ్యునరేషన్ పెంచేసి డిమాండ్ చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె ఈ వెబ్ సిరీస్ కోసం భారీగా డిమాండ్ చేస్తుందని సమాచారం. ఇకపోతే గతంలో ఒక్కొక్క సినిమాకు రూ.3 కోట్ల వరకు పారితోషకం అందుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు రీఎంట్రీలో కూడా ఇలా డిమాండ్ చేస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news