దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మోడీ, ద్రౌపది ముర్ము

-

ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి జీవితాలు సంతోషం, విజయంతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ట్వీట్ చేశారు. 2023 సంవత్సరం అందరి జీవితాల్లోనూ కొత్త స్ఫూర్తిని, లక్ష్యాలను, విజయాలను తీసుకురావాలని రాష్ట్రపతి ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, సమ్మిళిత అభివృద్ధికి పునరంకితం కావాలని సంకల్పి్ద్దామని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తాను ప్రజల పురోగతిని, శ్రేయస్సును కోరుకుంటున్నానన్నారు.

 

ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ జోడో యాత్ర వీడియోను ట్వీట్ చేశారు. ‘2023 లో, ప్రతి వీధి, ప్రతి గ్రామం, ప్రతి నగరం ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు రాహుల్‌. వీరితో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, మంచి ఆరోగ్యం, శాంతి వెల్లివిరియాలి’ అని ట్వీట్‌ చేశారు రాజ్‌నాథ్‌ సింగ్‌. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాలు ముఖ్యమంత్రులు సోషల్‌ మీడియా వేదికగా న్యూ ఇయర్‌ విషెస్‌ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 2023 ఏడాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news