ఆ కంపెనీ‌లు మావే.. కేసీఆరే నా బలం!

-

మ్మం: ఇటీవల కాలంలో ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. జూన్ 25న విచారణకు హాజరుకావాలని ఆయనకు ఈడీ సూచించింది. ఈ నేపథంలో నామా నాగేశ్వరావు వివరణ ఇచ్చారు. ఖమ్మం ప్రజలకు తన గురించి తెలుసన్నారు. తానెడూ నీతి నిజాయితీగా ఉన్నానని తెలిపారు. కేసీఆర్ తనను ఏ నమ్మకంతో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పెట్టారో అదే నమ్మకం‌తో పని చేస్తానననారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తన బలం కేసీఆర్, బలగం ఖమ్మం నియోజక వర్గ ప్రజలని చెప్పారు. 40 సంవత్సరాల క్రితం మదుకాన్‌ను స్థాపించామని తెలిపారు.

‘‘ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేశాం. ముంబై నుంచి మంగళూరు ప్రాజెక్టు చేశాం. చైనా బార్డర్‌లో కూడా మేము రోడ్లు వేస్తున్నాం. నేను రాజకీయాల్లో ఉండటం వల్ల ఆ కంపెనీ‌లు మా సోదరులు చూస్తున్నారు. రాంచీ ఎక్స్ప్రెస్ వే, ఎస్పీవి బీవోటీ ప్రాజెక్టు 30శాతం ఈక్విటీ తో 2011లో ప్రారంభం అయింది. ఎన్‌హెచ్‌ఏ అగ్రిమెంట్ తర్వాత 80శాతం 90 రోజుల్లో 100శాతం సైట్ ఇవ్వాలి. ఏడేళ్లు అయిన ఎన్‌హెచ్‌ఏ పూర్తి సైట్ ఇవ్వలేక పోయింది. సైట్ ఇచ్చిన మేరకు 60శాతం పని పూర్తి అయింది. దాదాపుగా మెజర్ కూడా అయింది. కేవలం 10శాతం మెజర్ పెండింగ్‌లో ఉంది. ఏ కారణం చేతో కంపెనీని టర్మీనెట్ చేశారు. రూ. 1,655 కోట్ల విలువైన ప్రాజెక్టులో రూ. 463 కోట్లు కంపెనీ.. మిగతాది బ్యాంక్‌లు ఇవ్వాలి. ఆ డబ్బులు మొత్తం ఎస్క్రూ అకౌంట్‌లో వేయాలి. దానిపై పూర్తి అధికారం బ్యాంక్ దే. రూ. 485కోట్లు కంపెనీ పెట్టింది. 652 కోట్లు మాత్రమే బ్యాంక్ పెట్టింది. ఎన్ హెచ్ ఏ సైట్ ఇవ్వక పోవడం వల్లనే ప్రాజెక్టు డిలే అయింది. 50శాతం పని పోయిర్తి అయినందునా మిగితా నిధులు తామే ఇస్తామని ఎన్ హెచ్ ఏ చెప్పి, వెనక్కి వెళ్ళింది. ఎవరూ ఈ ప్రాజెక్టు మీదా కంప్లైంట్ చేయలేదు. బీహార్‌లో చెట్లు కొట్టిన కేసుకి సంబంధించి ఒక పిల్‌లో ఈ ప్రాజెక్టు‌ని ఇంప్లీడ్ చేశారు. ఆర్బిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌లో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. అవార్డ్ అయ్యే వరకు కంపెనీ వేచి చూస్తుంది. ఆ కంపెనీలో నేను డైరెక్టర్‌ను కూడా కాదు.’’ అని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news