కంగనా రనౌత్‌కు బెదిరింపులు..అత్యాచారం చేస్తానంటూ..

-

గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుసున్న నటి కంగనా రనౌత్ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి..నడి రోడ్డుపై హత్యాచారం చేస్తానంటూ ఒడిశాకు చెందిని వ్యక్తి సోషల్‌ మీడియాలో కామెంట్ పెట్టాడు..సుశాంత్ మృతి తర్వాత బాలీవుడ్‌ మాఫియా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చింది.. సుశాంత్‌ కేసు విచారణపై వివాదాస్పద ట్విట్లు చేస్తూ కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వంతోనూ తనదైన శైలిలో పోరాటం చేస్తుంది..రైతుల ఆందోళనలపై సంచలన కామెంట్స్ చేసినందుకు ఇప్పటికే ముంబై, కర్నాటక, తమిళనాడులో కంగనాపై కేసులు నమోదు అయ్యాయి..ఈ నేపథ్యంలో కంగనాకు బెదిరింపులు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం తన సోదరుడి పెళ్లిలో బిజీగా కంగనా..ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా కంగనా షేర్‌ చేసిన ఫొటోలు, వీడియోలకు ఒడిశాకు చెందిన న్యాయవాది నుండి నడిరోడ్డుపై అత్యాచారం చేస్తానంటూ కామెంట్స్‌ రావడంతో నెటిజన్స్‌ షాకయ్యారు..ఈ వ్యవహారంపై స్పందించిన న్యాయవాది తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని అన్నారు. నాకు స్త్రీలు, సమాజంపై గౌరవం ఉంది. నా అకౌంట్‌ నుండి వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్‌ వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అంటూ సదరు న్యాయవాది తెలియజేసి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను డిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news