గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన కంగనా రనౌత్

-

రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా.. ఇలా అన్ని రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు. ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వ్యాపింపజేస్తున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్​లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పాల్గొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మొక్కలు నాటారు. శంషాబాద్ లోని పంచవటి పార్క్​లో కంగనా రనౌత్ మొక్కలు నాటారు. ప్రముఖ జ్యోతిష్యుడు బాలు మున్నంగి ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినట్లు కంగనా తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రాజ్యసభ ఎంపి సంతోశ్​ కుమార్ కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం అని కొనియాడారు.

ఈ ఛాలెంజ్ ను అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంచాలని కంగనా కోరారు. అనంతరం తన సోదరి రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ , అంజలీ చౌహాన్​లకు కంగన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. వారు కూడా ఈ ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news