టీడీపీ, జనసేన కలవాలి: కన్నా లక్ష్మీనారాయణ

-

టిడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి, జనసేన కలిసి పని చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వాక్యానించారు. నాయకులు ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని, పోత్తుకు ఎంతవరకు అవకాశం ఉందో రెండు పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడుకోవాలని అభిప్రాయపడ్డారు.

నేను మొదటి నుండి చంద్రబాబు కు వ్యతిరేకంగా పని చేసిన వాడినని… రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని తెలిపారు. ఇలాంటి పాలన ను పారద్రోలాలి అంటే ప్రజాస్వామ్య వాదులు అంతా చేతులు కలపాలని.. సీఎం జగన్ సంక్షేమాన్ని వదిలి..సొంత వ్యాపారాలను పెంచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రజల తలకాయలు తాకట్టు పెట్టి పాలన సాగిస్తున్నారని.. ప్రజల ఆస్తులు అమ్మి పాలన సాగిస్తున్నారు..ఈ డబ్బులన్నీ ఏం అవుతున్నాయని ఆగ్రహించారు కన్నా లక్ష్మీనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news