టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం. చంద్రబాబుతో తాము ఎంతకాలం నుంచి ఉన్నామో అందరికీ తెలుసని, ఎంత ఇబ్బంది పడ్డామో కూడా అందరికీ తెలుసని అన్నారు. అయితే సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా జగన్ తండ్రి వైఎస్ తో తమకున్న సన్నిహిత సంబంధాలను కరణం గుర్తుచేసుకున్నారు. అలాగే చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే వెలుగొండ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉందని, వెలుగొండ విషయంలో ఎంతో ఒత్తిడి తెచ్చినా అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇకపోతే వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వైసీపీలో చేరాలని భావిస్తున్నారని వివరించారు. వారు సీఎం జగన్ తోనూ, ఇతర వైసీపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు వైఖరికి, జగన్ వ్యవహారశైలికి ఎంతో తేడా ఉందని, జగన్ ను నమ్మినవాళ్లకు తప్పకుండా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
బాబుపై కరణం సంచలన వ్యాఖ్యలు..!
-
Previous article
Next article