కర్ణాటక ఎన్నికలు: పోలింగ్ బూత్ లోనే మహిళ ప్రసవం… !

-

నిన్న సాయంత్రం కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని పార్టీట్లు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఆలస్యంగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న ఎన్నికల సమయంలో ఒక అనూహ్య ఘటన జరిగింది. కర్ణాటకలోని కంప్లి నియోజకవర్గం కొర్లగుంది వోటింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిండు గర్భవతిగా ఉన్న మనీలా అనే మహిళ వచ్చింది. అయితే వచ్చిన కాసేపటికే ఆమెకు నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. దీనితో అక్కడ ఉన్న అధికారులు మహిళ సిబ్బంది సహాయంతో ఆమెకు పురుడు పోశారు.

దీనితో పోలింగ్ బూత్ లోనే ఒక మెగా శిశువుకు ఆ తల్లి జన్మను ఇచ్చింది. ఈ ఘటన కారణంగఅ కొంతసేపు పోలింగ్ ను అధికారులు ఆపివేయడం జరిగింది. ప్రసవం అనంతరం దగ్గర్లోని హాస్పిటల్ కు తల్లీ బిడ్డను తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news