TDP అంటే.. “తెలుగుదేశం పందుల దొడ్డి” : వైసీపీ ఎమ్మెల్యే

-

అమరావతి : టీడీపీ అంటే తెలుగుదేశం పందుల దొడ్డి అని… తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర రావు చురకలు అంటించారు. ఆ పందుల దోడి నుంచి పట్టాభి అనే పందితో మాట్లాడిస్తున్నారని… గత ఐదేళ్ళు ఈ పందుల గుంపు ఏం చేసిందో అందరికీ తెలుసు అని నిప్పులు చెరిగారు. నా పై సిగ్గులేకుండా తెలుగుదేశం పందుల దొడ్డి నుంచి పట్టాభి అనే పందితో చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. టీడీపీ హయాంలో జరిగిన వ్యవహారాన్ని నాకు అంటగట్టాలి అని చూస్తున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.

1987లో గ్రీన్ బెల్ట్ తెలుగుదేశం హయాంలో పెట్టారని.. అప్పుడు ఈ పట్టాభి నిక్కర్ వేసుకున్నాడని చురకలు అంటించారు. ఒక్క సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతల ఇన్వాల్ మెంట్ ఉందని.. ఎటువంటి వంటి విచారణకైనా సిద్ధమన్నారు తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర రావు. రాజకీయాల్లో మచ్చ లేని వ్యక్తి కారుమురి అని.. స్కాములు అంటే టీడీపీ చేసినవే అన్నారు. వందలు స్కాములు టీడీపీ హయాంలో చేశారని… నాపై చేస్తున్న ఆరోపణలు నిరోపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా… లేకుంటే రాజకీయాల్లో నుంచి చంద్రబాబు తప్పుకుంటారా అనినిలదీశారు తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర రావు.

Read more RELATED
Recommended to you

Latest news