లోకేష్ బఫున్ కి ఎక్కువ..జోకర్ కి తక్కువ : వైసీపీ ఎమ్యెల్యే సెటైర్లు

-

నారా లోకేష్ పై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య రాజకీయలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని.. నారా లోకేష్ కు సంస్కారంగా మాట్లాడడం కూడా తెలీదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ను చూసి లోకేష్ నేర్చుకోవాలని.. మాజీ సీఎం వైఎస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో లోకేష్ నేర్చుకోవాలని చురకలు అంటించారు. పులికి పులిబిడ్డ పుట్టింది…నక్కకు నక్క బిడ్డ పుట్టిందని.. లోకేష్ బఫున్ కి ఎక్కువ ..జోకర్ కి తక్కువ అని సెటైర్లు వేశారు. సోనియాను ఎదిరించి జగన్ మగాడనిపించుకున్నాడని.. 150 మందిని గెలిపించుకొని రాజశేఖర్ రెడ్డి వారసునిగా జగన్ నిలిచారన్నారు. లోకేష్ ఒక జోకర్.. వార్డు మెంబర్ గా కూడా గెలవలేదని చురకలు అంటించారు. ప్రశాంతంగా ఉండాలని చెప్పాల్సిన లోకేష్ ప్రతీకారం తీర్చుకుంటామని రెచ్చగొట్టారని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేయకుండా నిలవడం ఎవరితరం కాదని.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏమి చేశారో గుర్తు చేసుకోవాలని మండిపడ్డారు.. “చేరుకులపాడు నారాయణ రెడ్డిని హత్య చేసిందెవరు…ఆ కేసులో నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేశారు. చేరుకులపాడు నదయన రెడ్డి హత్యకేసులో ముద్దాయిలను కాపాడింది చంద్రబాబు, లోకేష్ కాదా..” అని ప్రశ్నించారు. ” పెసరవాయి హత్యలపై దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థచే దర్యాప్తు చేయించుకోండి…లేదంటే విదేశీ సంస్థలతో దర్యాఫ్తు చేయించుకోవాలని సవాల్ విసిరారు. పెసరవాయిలో హత్యకు గురైన వారి చరిత్ర అందరికి తెలుసు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news