నేడు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వమతాలను గౌరవించడమే కాకుండా ఆ మతస్థులకు సంబంధించిన వేడుకలను అధికారికంగా జరిపిస్తారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకుకు ప్రారంభమవనున్న క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరపనున్నారు.

క్రిస్మస్‌ విందులో 12 వేల మంది ప్రజలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పలువురికి సీఎం కేసీఆర్‌ పురస్కారాలు అందజేయనున్నారు. మరోవైపు క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ విషయం గమనించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news