పుట్టిన రోజు నాడు జగన్‌ పై లోకేష్‌ వివాదస్పద వ్యాఖ్యలు..వారిని చంపేందుకే ఉన్నాడంటూ !

-

 

పుట్టిన రోజు నాడు జగన్‌ పై లోకేష్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ముస్లిం మైనారిటీలని అంతమొందించేందుకే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న టిడిపి నేత షేక్ ఇబ్రహీం గారిని నరసరావుపేట పట్టణంలో అంతా చూస్తుండగానే అత్యంత కిరాతకంగా హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకి పరాకాష్ట అని ఆగ్రహించారు.

వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త ఆలీ గారి పరిస్థితి విషమంగా ఉంది. ఇవి ముమ్మాటికీ వైసీపీ సర్కారు స్పాన్సర్డ్ మర్డర్లేనన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఉసురు తీశారు. ఇప్పుడు ఇబ్రహీం సాబ్ ని చంపేశారు. జగన్ రెడ్డి గారూ.. మీ ధనదాహం, రక్తదాహం తీరదా? అని నిలదీశారు లోకేష్‌. ఇబ్రహీం ని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారిని, అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. ఇబ్రహీం కుటుంబానికి, దాడిలో గాయపడిన అలీ కి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వైసిపి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మా పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news