ఖాళీ స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు.. 15 రోజుల్లోనే నిధులు విడుదల

-

ఈ నెల 10వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నది.

అలాగే ముందస్తు ఎన్నికలపై కూడా సీఎం కెసిఆర్ చర్చించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ముఖ్యంగా సొంత జాగా ఉన్నవారికి మూడు లక్షల రూపాయలు ఇచ్చేందుకు కేసిఆర్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లోనే ఈ స్కిo కు సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఏ నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులకు ఈ నిధులు ఇవ్వాలనే దానిపై ఇవాళ కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు. కేవలం 15 రోజుల్లోనే ఈ స్కీంకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news