తెరాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు. నేడు ఒక్కరోజే నాలుగు సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎల్లారెడ్డిలో మంగళవారం సాయంత్రం నిర్వహించనున్న సభలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సభా వేదిక, తదితర ఏర్పాట్లను మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, స్థానిక తెరాస అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుక భారీగా జనసమీకరణ చేస్తున్నారు. 50 వేల మంది ప్రజలను తరలించేందుకు వాహనాలను సమకూర్చుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇందుకుగాను మొత్తం 200 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముందస్తు ప్రకటన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వేగాన్ని మహాకూటమి అందుకోలేపోతున్నారు.
గులాబీ వర్ణమైన కామారెడ్డి
-
Previous article
Read more RELATEDRecommended to you
ప్రభాస్ ‘కల్కీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కల్కి 2898...
Anji N -
బరువు తగ్గించే శస్త్రచికిత్సలో 150 కిలోల వ్యక్తి మృతి
బరువు తగ్గించేందకు చాలామంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు..కఠినమైన డైట్లు ఫాలో...
మల్కాజిగిరిలో ఈటెల వన్ మ్యాన్ షో… పోటీ ఇవ్వలేకపోతున్న ప్రత్యర్థులు
తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లో వచ్చేనెల 13న ఎన్నికలు...