సింగరేణి కార్మికులకి శుభవార్త చెప్పిన కేసీఆర్

-

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త ప్రకటించారు. అక్టోబర్ 23న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో, కార్మికులకు లాభాల బోనస్ 28శాతంను.. ఈనెల 23న చెల్లిస్తున్నట్లు సింగరేణి సంస్థ ఎండీ ఎన్ . శ్రీధర్ తెలిపారు.

2019-20 సంవత్సరానికి గానూ 278. 28 కోట్ల రూపాయలను.. ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సగటున ఒక్కో కార్మికునికి 60 వేల 500 రుపాయలు లాభాల బోనస్ లభించే అవకాశ ఉంది. కరోనా లాక్‌ డౌన్ కారణంగా మినహాయించిన జీతాన్ని, 23వ తేదీన ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. అలానే దసరా పండుగ అడ్వాన్స్ డబ్బులను ఈనెల 19న కార్మికుల ఖాతాల్లోకి చెల్లిస్తామన్నారు సీఎండీ శ్రీధర్.

Read more RELATED
Recommended to you

Latest news