సింగరేణి కార్మికులకు దీపావళి కానుక ప్రకటించిన కేసీఆర్..

-

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటికే దసరా కానుకగా బోనస్‌ లు ప్రకటించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. ఇప్పుడు దీపావళి కానుక ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దీపావళిని పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. కార్మికులకు దీపావళి బోనస్ కింద ఏకంగా రూ. 296 కోట్లు చెల్లించనుంది.

ఈ బోనస్ కూడా పండుగకు ముందు ఈనెల 21వ తేదీన చెల్లించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ చైర్మన్ ఎండి శ్రీ ఎన్. శ్రీధర్ ఈ మేరకు సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలుతో పాటు ఈ తీపి కబురు తెలియజేశారు. ఈసారి గరిష్టంగా ఒక్కో కార్మికుడు దీపావళి బోనస్ కింద రూ. 76,500 వరకు అందుకొనున్నారని శ్రీధర్ వివరించారు. ఈ బోనస్ ను కార్మికుల ఖాతాల్లో ఈ నెల 21వ తేదీన జమ చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి ఫైనాన్స్ అండ్ అకౌంట్ విభాగాన్ని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news