కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష – పువ్వాడ అజయ్

-

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షా అని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. కేసీఆర్ ని గద్దె దించాలని కొంతమందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని.. కొంతమంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనల పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

గత డిసెంబర్ వరుకు కేసీఆర్ ని ఎంతగా ఉపయోగించుకున్నారో వాళ్లకు తెలియదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యక్తిగత పదవులు ఇవ్వలేదని ఆయనని విమర్శించడం ఎంత వరుకు కరెక్ట్ అన్నారు. మంచి పనులు చేయడం కేసీఆర్ తప్ప.. అందుకేనా కేసీఆర్ ని గద్దెదించేలా చేస్తారా అని మండిపడ్డారు. కళ్ళు ఉన్న కాబోదులు గోదావరి జలాలుతో కాళ్ళు ఎప్పుడు కడుగుతారు అంటున్నారని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గం నుండి వేలేరుపాడు, కుకునూరు మండలాలను బీజేపీ పార్టీ లాక్కుంటే.. అదే పార్టీ వైపు కొంతమంది చూస్తున్నారు.. అది వారి విజ్ఞత అన్నారు. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తగా అభివృద్ధిలోని శిలా ఫలకం ఒక్కటైన చూపించాలన్నారు. మీ ఒక్కరికి కడుపు నొప్పి వస్తే అందరికి వచ్చిందనుకుంటే అది మీ పొరపాటేనన్నారు. కేసీఆర్ ని గద్ది దించడం నీ వల్ల కాదు కధ ఎవరి వల్ల కాదన్నారు పువ్వాడ అజయ్.

Read more RELATED
Recommended to you

Latest news