బొజ్జల మృతి పై కేసీఆర్ సంతాపం..ఆత్మీయుడిని కోల్పోయా అంటూ..

-

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్.. బొజ్జల మృతిపై సంతాపం తెలుపుతూ కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. సహచరుడు, ఆత్మీయుడిని కోల్పోయానంటూ కెసిఆర్ సదరు ప్రకటనలో పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

టిఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కెసిఆర్ కూడా టిడిపిలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కెసిఆర్ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేతల్లో బొజ్జల కూడా ఒకరు. ఈ కారణంగానే బొజ్జల మృతి వార్త తెలిసిన వెంటనే తమ ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్రకటించారు.కాగా కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాలకృష్ణా రెడ్డి కొద్దిసేపటి క్రితం అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

Read more RELATED
Recommended to you

Latest news