రెండోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు – కేసీఆర్

-

ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఓ ప్రముఖ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌ మాట్లాడుతూ… నాకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్నారు కేసీఆర్.

kcr pridict about jagan

ఏపీ రాజకీయ పరిస్థితులు, ఇక్కడి పరిస్థితులు చాలా తేడాగా ఉంటాయన్నారు. ఏపీ ప్రజలు చాలా తెలివైన వారు.. వారు మంచి చేసే నాయకున్ని ఎన్నుకుంటారన్నారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర…నేటితో ముగియనుంది. అయితే ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్నట్లు జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news