రేపు అధికారులతో కేసీఆర్‌ సమీక్ష..ఈ అంశాలపైనే ఫోకస్‌..!

-

ఉన్నతాధికారులతో రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు..కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం 2గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహిస్తారు..తాజాగా తెలంగాణలో కరోనా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు..2020-21బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష జరుపుతారు..కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులపై కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

ధరణి పోర్టల్ అమలులో వస్తున్న సమస్యల సమావేశంలో చర్చించనున్నారు..ధరణి పోర్టల్ పై హైకోర్టు ఇచ్చిన స్టేపై న్యాయనిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు.శనివారం నాడు జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news