వైరల్‌ : హైదరాబాద్‌ లో కలుసుకున్న జగన్‌, కేసీఆర్‌..

-

ఇవాళ ఉదయం అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. చాలా రోజుల అనంతరం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… ఒకే చోట కనిపించారు. అవును ఇది నిజమే. హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మనవరాలి వివాహం జరిగింది. అయితే.. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మనవరాలి వివాహానికి… తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరియు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇద్దరూ హాజరయ్యారు.

అంతేకాదు… ఈ వివాహ వేడుకలో…. పక్క పక్కనే కూర్చుని ముచ్చటించారు ఇరు రాష్ట్రా సీఎంలు కేసీఆర్‌ మరియు జగన్‌ మోహన్‌ రెడ్డి. అలాగే… ఇద్దరూ సీఎంలు… ఆ నూతన వధు వరులను ఆశ్వీర్వదించి… వారితో ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. కాగా… రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న తరుణంలో… ఇద్దరు సీఎం లు ఒకే దగ్గరే ప్రత్యక్షం కావడం..అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news