ఖుషి సినిమా సెట్​లో సమంత.. గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పిన టీమ్​

-

మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంత వరుస సినిమా షూటింగుల్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ‘సిటాడెల్’​ ఇండియన్​ వెర్షన్​ షూట్​లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఖుషి సినిమా సెట్​లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రబృందం సామ్​కు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పింది. సెట్​లో ఉమెన్స్​ డేను సెలబ్రేట్​ చేసి సమంతకు సర్​ప్రైజ్​ ఇచ్చారు దర్శకుడు శివ నిర్వాణ. ఆ తర్వాత మూవీ టీమ్​ అంతా కలిసి సామ్​ చేత కేక్​ కట్​ చేయించారు.

దీనికి సంబంధించిన ఫొటోలను ‘ఖుషి’ డైరెక్టర్ తన ట్విటర్​ ఖాతాలో షేర్​ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్​ సగంలోనే ఆగిపోయిందంటూ అనేక వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా సెట్స్​లోకి వెళ్లే ఛాన్స్​ లేదంటూ నెట్టింట గుసగుసలు కూడా మొదలయ్యాయి. అయితే వాటన్నింటికి ఫుల్ స్టాప్​ పెట్టిన మూవీ టీమ్​ సమంతకు ఇలా గ్రాండ్​ వెల్​కమ్​ చెప్పింది.

ఇక ఇటీవల తాజాగా వరుణ్​ ధావన్​తో కలిసి ‘సిటాడెల్’​ షూటింగ్​లో పాల్గొన్న సమంతపై భారీ యాక్షన్​ సీన్లను చిత్రీకరిస్తోంది ఆ చిత్ర​ టీమ్​. దీంతో చిత్రీకరణలో ఆమె చేతికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ షూట్​తో పాటు తన మరో ప్రాజెక్ట్ అయిన​ ‘ఖుషి’ సెట్స్​లోకి సామ్​ అడుగుపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news