అర్చకులను కాలితో తన్నడం రాక్షస చర్య : చంద్రబాబు

-

కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అర్చకులను కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య అని మండిపడ్డారు. ‘అర్చకుడు అంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తాం. వారి కాళ్లకు మొక్కే సాంప్రదాయం మనది. అలాంటిది వైసీపీ నేతల మదానికి ఇది నిదర్శనం’  అని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు.

ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. “కాకినాడ శివాలయంలో పూజ సరిగా చేయలేదని గర్భగుడిలో అర్చకులపై వైకాపా నేత సిరియాలు చంద్రరావు దాడి చేశాడు. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపమా? పూజారులపై దాడి చేసిన వైసీపీ నేతను తక్షణమే అరెస్టు చేయాలి. మరో రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఈలోగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసులకు విన్నవిస్తున్నా” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news