తెలంగాణలో కిడ్నాప్ కలకలం.. 45 లక్షలిస్తేనే !

-

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కలకలం సంచలనంగా మారింది. మహబూబాబాద్ కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్ ఓ న్యూస్ ఛానల్లో వీడియో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డిని (10) ని గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి కిడ్నాప్ చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకుపోయినట్టు తెలుస్తోంది. రాత్రయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాలలో వేతకడంతో ఓ వ్యక్తి ద్విచక్రవాహనం మీద తీసుకెళ్లారని బాలుడి మిత్రులు తల్లిదండ్రులకు చెప్పారు.

ఈ క్రమంలో రాత్రి 9 గంటల 45 నిమిషాలకు కిడ్నాపర్లు తల్లి కి ఫోన్ చేసి 45 లక్షలు ఇస్తే విడిచిపెడతామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని బెదిరించారు. మీ చుట్టుపక్కల మా వ్యక్తులు ఉన్నారని, మీరు ఏం చేస్తున్నది మాకు తెలుస్తుందని పేర్కొన్నారు. దీంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి స్వయంగా ఆ ఇంటిని పరిశీలించి జరిగిన సంఘటన గురించి దర్యాప్తు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news