మే10 తరవాత పెను మార్పులు చూస్తారు: కిషన్ రెడ్డి

-

ఎన్నికలకి ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరిగి పోతోంది. అయితే దీనిలో భాగంగా ప్రధాన పార్టీలు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంకోసారి భారీ మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది అందుకని అనుగుణంగానే రాష్ట్రంలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

దీనిమీద కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారు మోడీ హవా కొనసాగుతుందని తాము చేసిన అభివృద్ధి పనులే తమకి గెలిపిస్తాయని ఈ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో తమ మీద విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈనెల 10 ఎల్బి స్టేడియంలో మోడీతో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తామని ఈ సభ తర్వాత పెను మార్పులు చోటుచేసుకుంటాయని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news