T-20 వరల్డ్ కప్ కి భారత జట్టు ప్రకటన

-

టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది.  జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. టీ 20 వరల్డ్ కప్ కి పంత్, శాంసన్ ఇద్దరిలో ఎవ్వరినీ ఎంపిక చేస్తారనే ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. ఇద్దరినీ ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక కే.ఎల్. రాహుల్ కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రిజర్వు ప్లేయర్ గా ఎంపికవుతాడనుకున్న రాహుల్ ని ఎంపిక చేయకపోవడం గమనార్హం.

టీమ్: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శివమ్ దూబే, పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య (VC), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, చాహల్, సిరాజ్, అర్జీప్ సింగ్.

ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్

 

Read more RELATED
Recommended to you

Latest news