Kishan Reddy :ఉగ్రవాదం, మతకల్లోలాను మోడీ అరికట్టారు

-

బీజేపీ కార్యాలయంలో ఈరోజు జరగిన బీజేపీ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని పరిపాలించిన ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉందని, కానీ పది సంవత్సరాలుగా నరేంద్రమోడి పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని ఆయన అన్నారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని …..అవినీతి పార్టీలు,కుటుంబ పార్టీలు కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ ఏర్పాటు చేశాయని ఎద్దేవా చేశారు.

అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు మరోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. సర్వేలన్ని కూడా మోడీకి ఎవరూ పోటీకి దరిదాపుల్లో లేరని చెప్పాయి .దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాలను మోడి అరికట్టారని కిషన్ రెడ్డి అన్నారు.ఫ్రంట్ ల పేరుతో మోడీని దించాలని కుట్ర పన్నుతున్నారు అని వాటి అన్నింటినీ ప్రజలు గమనిస్తు ఉన్నారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news