కర్ణాటక బిజెపి రాజ్యసభ ఎన్నికల ఇన్చార్జిగా కిషన్ రెడ్డి నియామకం

-

ఈ నెల 10వ తేదీన వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలను నియమించింది. ఈ క్రమంలో కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఇన్చార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్, హర్యానాకు గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్ కు నరేంద్ర సింగ్ తోమర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రకటనను విడుదల చేసింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్లు ప్రకటనలో తెలిపింది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news