కిషన్‌ రెడ్డి పేరు చెప్పి..ఏపీ సర్కార్‌ కు బురిడి : జగన్‌ కు కేంద్ర మంత్రి లేఖ

-

తిరుమల : టిటిడి పాలక మండలి ప్రత్యేక ఆహ్వనితుల నియామకంలో ట్విస్ట్ నెలకొంది. ఈ నేపథ్యం లోనే ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం జగన్ కి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన సిఫార్సు తో రవిప్రసాద్ అనే వ్యక్తి కి పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుడి గా నియామకం జరిగినట్లు ప్రచారం జరుగుతుందని విస్మయం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

తాను కానీ… తన మంత్రిత్వ శాఖ ద్వారా కానీ.. ఎవరికి పదవీ ఇవ్వాలని సిఫార్సు చేయలేదని లేఖ లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిశిలన జరపాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన పై దుష్ప్రచారం చేస్తూన్న వారి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాగా.. రెండు రోజుల కింద టీటీటీ పాలక మండలి సభ్యులను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నియామకం చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news