విశాఖ పట్టణం రాజధాని ప్రాంతం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలనం

-

విశాఖ లో జరుగుతున్న ఇన్వేస్ట్‌ సమ్మిట్‌ లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోటి వెంట విశాఖ రాజధాని ప్రస్తావన వచ్చింది. ఎమ్మెల్సీగా మాధవ్ ను ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. విశాఖ పట్టణం రాజధాని ప్రాంతం అని వివరించారు.

విశాఖ జిల్లా కేంద్రంలో మాధవ్ వంటి వారు ఉంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందన్నారు కిషన్‌ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని… రాజకీయం ప్రయోజనాల కోసం విమర్శలు , బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నా రన్నారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని… హైదరాబాద్లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం లో రాజధానిలో నిర్వహించే సభకు రాష్ట్ర పతి హాజరవుతారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news