ముందు మీ చరిత్ర ఏంటో తెలుసుకోండి.. మోడీకి ఖర్గే కౌంటర్..!

-

లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం రోజు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఇటీవలే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టోను పోలి ఉందని మోడీ విరుచుకుపడ్డారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.

మతం పేరుతో దేశాన్ని విభజించేందుకు బీజేపీ దేశాన్ని విభజిస్తుందని మండిపడ్డారు. ముందు తమ చరిత్ర ఏంటో తెల్సుకోవాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ముందుగా తమ చరిత్ర చూసుకోవాలని.. బెంగాల్ లో ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ సిద్ధాంతకర్తే అని ఎద్దేవా చేశారు. మోడీ మనసులు హిందూ- ముస్లిం అన్న భావనే ఉందని.. మతం పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించి సమాజాన్ని విచ్చిన్నం చేసేందుకే వాళ్లు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని బీజేపీ అసలు సరిగ్గా చదవలేదని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news