17 సీట్లను గెలిచి TPL కప్ కొడతాం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఇండియా పొలిటికల్ లీగల్ కప్, టీపీఎల్ లోనూ బీజేపీదే విజయం అని బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశంలో, రాష్ట్రంలో తమదే హవా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల టోర్నమెంట్ లో కాంగ్రెస్ టీమ్ కి ప్లేయర్లు కరువయ్యారని ఎద్దేవా చేశారు. టీమ్ సభ్యులున్నా బీఆర్ఎస్ తీవ్ర నిరాశలో ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో 17 సీట్లను గెలిచి టీపీఎల్ (తెలంగాణ ప్రీమియర్ లీగ్) కప్ గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మోడీ పాలనలో కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారని గుర్తుచేశారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. 370 ఆర్టికల్ ని రద్దుచేసి కాశ్మీర్ ని భారత్ లో అంతర్భాగం చేశారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news