అదరగొట్టిన కింగ్ కోహ్లీ… ఐపిఎల్ లో 48 వ అర్థ సెంచరీ !

-

ఐపిఎల్ లో ఈ రోజు డబుల్ ధమాకా మ్యాచ్ లు జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా డే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మరియు బెంగళూర్ మధ్యన జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూర్ పవర్ ప్లే లో కోహ్లీ మరియు డుప్లిసిస్ లు అద్భుతంగా ఆడి 59 పరుగులు సాధించారు. ఆ తర్వాత ఎందుకో ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగుతోంది. కానీ ఇద్దరూ చూడచక్కని షాట్ లతో ప్రేక్షకులను అలరించారు. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి… కోహ్లీ ఐపిఎల్ కెరీర్ లో 48 వ అర్థ సెంచరీతో అదరగొట్టాడు.

కోహ్లీ 47 బంతుల్లో 59 పరుగులు చేసి హర్ప్రీత బ్రార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం చూస్తుంటే స్కోర్ 180 కూడా అయ్యేలా లేదు. ఈ పిచ్ మీద చేజింగ్ చాలా కష్టం అయ్యేలా ఉంది. మరి ఏ మాత్రం స్కోర్ RCB పంజాబ్ కు టార్గెట్ గా ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news