పొంగులేటి శ్రీనివాస్ పై కూనంనేని సెటైర్లు

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై సెటైర్లు వేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లా నుంచి కేవలం ఒక్క సీటును మాత్రమే బిఆర్ఎస్ గెలిచిందని.. 2023లో ఆ ఒక్క సీటు కూడా రాకుండా చేస్తానని, ఖమ్మం జిల్లా నుండి ఒక్క ఎమ్మెల్యే ని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు కూనంనేని.

ఒక ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు నావే అంటున్నాడని.. ఆత్మీయ సమ్మేళనాలతో వస్తున్నారని.. వారికి పైసలే పరమాత్మ, జనంతో సంబంధం లేదని సెటైర్లు వేశారు. పది సంవత్సరాలుగా ప్రజల కోసం ఒక్క పని చేయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఓట్లని డబ్బుతో కొనాలని చూస్తున్నాడని ఆరోపించారు. మరొక ఆయన హైదరాబాద్ లో ఉంటాడని.. ఆయన ఇక్కడికి వస్తే ఓట్లు పడతాయి అంటున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే జలగంపై కామెంట్స్ చేశారు. కెసిఆర్ తప్పు చేస్తే కూడా ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తామన్నారు కూనంనేని.

Read more RELATED
Recommended to you

Latest news