కోహ్లి, గంభీర్ ఫొటోలు షేర్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ కోల్‌కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈరోజు 7:30 కు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఆసక్తికరమైన ఫొటోలు షేర్ చేసింది. ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్, ఆర్సీబీ ఆటగాడు కోహ్లి ఉన్న ఫొటోను పంచుకుంది. ఒకదాంట్లో విరాట్ కోహ్లిని, మరో దాంట్లో గౌతమ్ గంభీర్ ని హైలైట్ చేసింది. అయితే.. ఐపీఎల్లో వీరిద్దరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఒక విజయాన్ని సాధించగా కోల్కత్తా నైట్ రైడర్స్ ఆడిన ఒక మ్యాచ్ లోను గెలుపొందింది.బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో RCB 14 గెలిచింది మరియు కోల్‌కతా 18 మ్యాచ్లలో గెలుపొందింది. మరి ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news