రికార్డు సృష్టించనున్న సునీల్ నరైన్

-

వెస్టిండీస్ ఆటగాడు,కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ కోల్‌కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈరోజు 7:30 కు మ్యాచ్ జరగనుంది.ఇవాళ మ్యాచులో ఆయన 500 టీ20లు ఆడిన ఏకైక స్పిన్నర్గా నిలవనున్నారు. ఈ కరేబియన్ ప్లేయర్ ఐపీఎల్తో పాటు పలు లీగ్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఓవరాల్ గా ఈ ఘనత అందుకున్న మూడో ప్లేయర్ గా నరైన్ రికార్డులకెక్కనున్నారు. ఇప్పటికే డ్వేన్ బ్రావో(573), షోయబ్ మాలిక్(542) ఈ జాబితాలో ముందున్నారు.

కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఒక విజయాన్ని సాధించగా కోల్కత్తా నైట్ రైడర్స్ ఆడిన ఒక మ్యాచ్ లోను గెలుపొందింది.బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో RCB 14 గెలిచింది మరియు కోల్‌కతా 18 మ్యాచ్లలో గెలుపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news