‘నా ఏకైక లక్ష్యం కేసీఆర్ ని గద్దె దించడమే’ : కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను గద్దె దించడమే తన ముందు ఉన్న ఏకైక లక్ష్యమని కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడులో ఇవాళ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారినా కాంగ్రెస్ లోకే వచ్చాను. నా ఏకైక లక్ష్యంకేసీఆర్ నియంత పాలనను గద్దె దించడమేనని.. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం యంత్రాంగం వందమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు.

మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడిన తప్పిస్తే.. మునుగోడు గడ్డ ప్రజలు ఎక్కడ కూడా తరలించుకునేలా చేయలేదు. ఆనాడు ఎంపీగా నన్ను పార్లమెంట్ కి పంపిస్తే తెలంగాణ గొంత వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి కష్టపడ్డామని.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబ చేతిలో పోయింది. ఆ కుటుంబాన్ని గద్దె దించడానికి పోరాడుతున్నానని తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి ప్రజాబలం ఉందని.. అధికారంలో ఉన్నా లేకపోయినా నా సొంత డబ్బులతో పేద ప్రజలకు సహాయం చేశానని.. రాజగోపాల్ రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్ష మంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news