మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేస్తా – కోమటిరెడ్డి

-

మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. హైద్రాబాద్ లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమావేశం….నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో నాకు ఘోర అవమానం జరిగింది….తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్ళను పక్కనపెట్టి, ద్రోహులకు పదవులివ్వడం ఆవేదనకు గురి చేసిందన్నారు. టీఆర్ఎస్ హవాలోనూ మునుగోడులో ఘన విజయం సాదించా…టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా….. ఎమ్మెల్సీగా గెలిపొందానని పేర్కొన్నారు.

12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా హై కమాండ్ లో చలనం లేదు..నేను సీఎల్పీ పదవిలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకునే వాన్ని అని పేర్కొన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు, ఇక భవిష్యత్ అంతా బీజేపీదేనని వెల్లడించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు..గెలిచినోళ్లు ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదని విమర్శలు చేశారు.మూడున్నరేళ్లుగా మునుగోడు అభివృద్ధి చేయలేక పోయాం…. ఉప ఎన్నిక వస్తేనైనా ప్రజలకు మేలు జరుగుతుందంటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news