కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: కేసీఆర్ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసింది … !

-

తాజాగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో కేసీఆర్ పాలన గురించి రెచ్చిపోయి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని కామెంట్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఏమి చేసిందో చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. కనీసం రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలోనూ ఈ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్ చేశారు. ఇక గత కొన్ని రోజులుగా అకాల వర్షాల వలన వర్షాలు పడి చేతికి రావలసిన పంటలు నీటమునిగిపోయి లక్షల ఎకరాలు నష్టపోయింది. అయితే ఇలా పాడై పోయిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడంలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి.

అందుకే ప్రజల బాగు కోసం పనికిరాని ఈ ప్రభుత్వాన్ని గాదె దించడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కోమర్తిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news