వైఎస్సార్‌తో ఉన్న ఫోటోతో… కొండా మురళి నివాళి..

-

దివంగత నేత వైఎస్‌ డా.రాజశేఖర్‌ రెడ్డి జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకొని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని స్మ‌రించుకుంటూ తెలంగాణ‌కు చెందిన‌ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి ఓ అరుదైన ఫొటోను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. వైఎస్ బ‌తికుండ‌గా… ఆయ‌న‌తో తాను కిలిసి దిగిన ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన కొండా ముర‌ళి… దివంగ‌త సీఎంకు నివాళి అర్పించారు.

Image

ఈ సంద‌ర్భంగా వైఎస్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను ముర‌ళి గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ను మ‌హానేత‌గా అభివ‌ర్ణిస్తూ.. ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇల్లు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదవాడి ఇంట్లో దేవుడై నిలిచార‌ని పేర్కొన్నారు కొండా మురళి.

 

Read more RELATED
Recommended to you

Latest news