BREAKING : బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బండి సంజయ్ సమక్షంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజేపి లో చేరారు. పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజేపి లో చేరారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కెవి రంగారెడ్డి కి విశ్వేశ్వర్ రెడ్డి మనవడు. అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కుమార్తె సంగీతారెడ్డి ఈయనకు భార్య.

మెగా కోడలు ఉపాసన తల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి అక్క చెల్లెల్లు కావడంతో ఆ కుటుంబంతో బంధుత్వం ఉంది. కాగా సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు 2013లో టిఆర్ఎస్ పార్టీలో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి 2014లో చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. పార్లమెంటు సభ్యుడిగా పని చేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news