మోడీ సింహంలా వస్తే… టిఆర్ఎస్ కుక్కలు పారిపోయాయి – బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, టిఆర్ఎస్ పార్టీ నాయకుల పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింహంల వస్తే… టిఆర్ఎస్ పార్టీ కుక్కలు పారిపోయాయంటూ ఎద్దేవా చేశారు.

కేంద్ర నిధులతో తెలంగాణ అభివృద్ధి చెందిందని… కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లిస్తుందని.. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతుందని కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని… మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని లాస్ లోకి తీసుకుపోయాడని కేసీఆర్ పై ఫైరయ్యారు. బిజెపి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యే వాడివా.. బిజెపి భిక్ష నీకు సీఎం పదవి అంటూ ఫైర్‌ అయ్యారు. 12 వందల త్యాగాల ఫలితంగా తెలంగాణ వస్తే.. ఈ రోజు నీ కుటుంబం పాలన చేస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news