కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్.. ఎందుకంటే?

-

జగిత్యాల జిల్లాలో కొలువైన కొండగట్టు అభయాంజనేయ స్వామి దేవాలయంలోని ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. నిత్యాన్నదాన సత్రంలోని బియ్యాన్ని ఆలయ ఉద్యోగి రాములు దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 9వ తేదీన సాయంత్రం అన్నదాన సత్రం నుంచి బియ్యం,నిత్యావసర సరుకులను జూనియర్ అసిస్టెంట్ రాములు అటోలో బయటికి తరలించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

గ్యాస్ ఎజెన్సీకి చెందిన అటోలో తరలిస్తున్నట్లు ఫుటేజీలో స్పష్టంగా ఉన్నది. ఈ క్రమంలో ఆలయానికి చెందిన నిత్యన్నదానం బియ్యం, సరుకులు పక్కదారి పట్టించినట్లు విచారణలో తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఈవో రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆలయ ఈవో మిగతాఅ ధికారులను కూడా హెచ్చరించారు. ఎవరైనా ఆలయ సొమ్మును పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news