అనిల్ కుమార్ యాదవ్ ను 50 వేల మెజారిటీతో ఓడిస్తాం…

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నెల్లూరు జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉండడమే కాక… ఏ ఎన్నికలు అయినా రసావసత్తరంగా జరుగుతూ ఉంటాయి. ఇక 2024 లో జరగనున్న ఎన్నికల్లోనూ ఇక్కడ ఆసక్తికర మలుపులు జరుగుతున్నాయి. ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలుస్తాడా నిలవడా అన్న విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కాగా ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులను ఎదుర్కొని గెలవడం అంతా ఈజీ కాదు. తాజాగా టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనిల్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ ఒకవేళ సీఎం జగన్ మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ కు సీటు ఇస్తే ఖచ్చితంగా 50 వేల మెజారిటీతో ఓడిస్తామని ఘంటాపధంగా మాట్లాడారు.

మరి ఇంతలా టీడీపీ నమ్మకంగా ఉందంటే రాజకీయ వ్యూహాలు ఎలా ఉండనున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news