మేము బిచ్చగాల్లమా ? మోడీ సభపై R కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

-

మోడీ సభపై రాజ్యసభ ఎంపీ R. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బిజెపి మీటింగ్ జరుగుతుంది.. బిసిలకు ఎం చేస్తారో ఈ మీటింగ్ లో ప్రకటించండి అని ఫైర్ అయ్యారు. కేంద్రం బిసి వ్యతిరేకి అని.. పార్లమెంట్ లో బీసీ బిల్లు కోసం ఉద్యమిస్తామన్నారు. సీఎం జగన్ బిసిల బిల్లుకు మద్దతు ఇచ్చారు.. బిసిలకు బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

జనాభా ప్రకారం బిసిలకు రిజర్వేషను ఇవ్వాలి.. బీసీ సంక్షేమ సంఘం తరపున అనేక పోరాటాలు చేశాం.. ఏ పార్టీ కూడా బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. బీసీలు బిచ్చగాళ్ళు కాదు.. బిజెపి బీసీలను మోసం చేస్తుంది.. బిసిలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.

బిసి, ఎస్సి, ఎస్టీల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది.. 54 శాతం ఉన్న బిసిల కోసం నిర్మాణాత్మక చర్యలు తీసుకోలేదు.. బిసిలకు రావాల్సిన వాటా 74 ఏళ్లుగా రాలేదని వెల్లడించారు. బిసిల కోసం బడ్జెట్ కేటాయించలేదు.. బిసిలకు కేవలం 1400 కోట్లు బిచ్చం వేసినట్టు వేశారన్నారు. మేము బిచ్చగాల్లమా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మోడీ బిసిల కోసం పోరాడుతనన్నారు. గెలవగానే మాట మార్చారు.. జనాభా లెక్కలు ఎందుకు చేయట్లేదని చెప్పారు. జనాభా లెక్కలు చెస్తే బిసిల జనాభా తెలిసి రిజర్వేషను ఇవ్వాలని బిజెపి భయపడుతుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news