Adipurush: జానకీ పాత్ర ముగిసింది.. ఇక మిగిలింది రామ,రావ‌ణుల వంతే..!

-

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రతినాయకుడైన రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు.

లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమ పాత్రను దేవ్ దత్ పోషిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి సీత పాత్రకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో సీత పాత్రకు సంబంధించిన తన పోర్షన్ ను కృతి సనన్ పూర్తిచేసింది. దాంతో ఈ సినిమా టీమ్ ఆమెతో కేక్ కట్ చేయించి వీడ్కోలు పలికారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా మూవీలో కృతి సీతాదేవిగా కనిపిస్తుంది.

ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ ‘డియర్ కృతి.. మీరు సీత పాత్రను చేస్తున్నప్పుడు మ్యాజికల్‌గా అనిపించింది. ఈ షూటింగ్ అప్పుడే అయిపోయిందంటే నమ్మలేకపోతున్నా. మీతో ప్రయాణం అద్భుతంగా ఉంది’ అని చెబుతూ.. ఆమె కేక్ కట్ చేస్తున్న ఫొటోను ట్వీట్ చేశాడు.
3D ఫార్మెట్ లోను రూపొందుతున్న ఈ సినిమా ఆగష్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న‌ది.
భారీ బడ్జెట్‌తో వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news