కంటి చూపుతోనే కైపు.. కృతిశెట్టి ఇలా ఉన్నావేంటి..

-

మెగా హీరో వైష్ణవ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌ కృతిశెట్టి. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో హాట్‌ బీట్‌ పెంచింది కృతిశెట్టి. ఉప్పెన్‌ సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

అయితే ఈ అమ్మడుకు సంబంధించిన లేటెస్ట్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎల్లో కలర్‌ డ్రెస్‌ ఓరచూపు చూస్తూ.. చూపుతోనే కైపు ఎక్కిస్తోంది. ఆమె ఫోటోలు చూసి నెటిజన్లు కంటి చూపుతోనే కవ్విస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఉప్పెన సినిమా తరువాత తెలుగులో ఆమె నటించిన ‘బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు సైతం సూపర్ హిట్ అవడంతో హ్యాట్రిక్ హిట్ సాధించిన కొత్త కథానాయికగా ప్రత్యేకంగా నిలిచింది కృతిశెట్టి.

ప్రస్తుతం కృతి తెలుగులో ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి , మాచర్ల నియోజకవర్గం’ లాంటి సినిమాలతో పాటు రామ్ పోతినేని హీరోగా, లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న పోలీస్ యాక్షన్ చిత్రం ‘ది వారియర్’ లోనూ నటిస్తోంది ఈ భామ.


అయితే తెలుగు తమిళ బైలింగ్విల్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. అంతేకాకుండా కృతి శెట్టికి కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు బాల దర్శకత్వంతో సూర్య హీరోగా నటించే ఆయన 41వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది కృతి.

Read more RELATED
Recommended to you

Latest news