భారీ వర్షం.. ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం..

-

హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షంతో రోడ్లపైకి నీరు వచ్చి చేరుతుండడంతో మాన్‌సూన్‌ డిజాస్టర్‌ ఫోర్స్‌ ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తూనే ఉన్నారు. అయితే రోడ్డుపై ఉన్న నీటి తడితో వాహనాలు స్కీడ్‌ అవుతున్నాయి. అయితే.. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్‌ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

One dies and six injured in accident on Hyderabad ORR

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించిన పోలీసులు వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news