మాకోసం వాళ్ళున్నారు, కేటిఆర్ కీలక వ్యాఖ్యలు…!

-

విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడినట్లుగా ఉందని తెలంగాణా మంత్రి కెసిఆర్ ఎద్దేవా చేసారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కేటిఆర్, పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని అన్నారు. కొత్తగా పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చామని గుర్తు చేసారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా సరే,

ప్రజలు తెరాస కే పట్టం కట్టారని ఆయన అన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో బ్రహ్మాండమైన విజయం సాధించామన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ భయపడుతోందని ఆయన ఎద్దేవా చేసారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తాము నేల విడిచి సాము చేయడం లేదన్న ఆయన ప్రజలు సంపూర్ణ మెజారిటి తమ కట్టబెట్టారన్నారు. 2014లో 63 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌..2018లో 88సీట్లలో గెలిచిందన్నారు మంత్రి. తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ అవతరించిందన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నామన్న ఆయన పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వచ్చిన తర్వాత గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలకు నిధులిచ్చామన్నారు.

సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు పోతామన్నారు. ఆరు లక్షల మందికి కేసీఆర్‌ కిట్‌ అందించామన్నారు. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని గుర్తు చేసారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిగా 60 లక్షల మంది గులాబీ సైనికులున్నారని కెసిఆర్ అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని స్పష్టం చేసారు. 95శాతం పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news